కేసీఆర్ కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ

కేసీఆర్ కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ

జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులను వెంటనే రెగ్యులరైజ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ప్రభుత్వంలో జూనియర్ పంచాయితీ కార్యదర్శుల పరిస్థితి బానిసల కంటే హీనంగా తయారైందన్నారు.. గొడ్డు చాకిరీ చేయించుకోవడమే తప్ప, వారి హక్కులను పరిరక్షించడంలో ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని మండిపడ్డారు. న్యాయంగా వారికి దక్కాల్సిన హక్కు అయిన ఉద్యోగాలను రెగ్యులర్ చేయాలని 12 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు అయిన లేదన్నారు.. ఎంత సేపూ రాజకీయాలే తప్ప జూనియర్ పంచాయితీ కార్యదర్శుల గోడు పట్టించుకునే పరిస్థితి లేదని రేవంత్‌ రెడ్డి విమర్శించారు.

Next Story