
By - Chitralekha |10 May 2023 12:21 PM IST
తెలంగాణలో ఎంసెట్ పరీక్షలు కొనసాగుతున్నాయి. మే 10 నుంచి 14వరకు జరగనున్న పరీక్షలకు అన్ని ఏర్పాట్లు అధికారులు పూర్తి చేశారు. తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 137 సెంటర్లలో పరీక్షలు జరగనున్నాయి. తెలంగాణలో 104, ఏపీలో 33, మొత్తం 137 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. 3. 20 లక్షల మందికి పైగా పరీక్షలకు హాజరు కానున్నారు. హైదరాబాద్ నుంచే అత్యధికంగా లక్షా 71వేల, 706 మంది పరీక్షలు రాయనున్నారు. గ్రేటర్ పరిధిలో మొత్తం 58 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు అధికారులు. 10, 11 తేదీల్లో మెడిసిన్, 12, 13, 14 తేదీల్లో ఇంజనీరింగ్ పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రతి రోజూ రెండు సెషన్లలో పరీక్షలు జరగనున్నాయి.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com