By - Chitralekha |10 May 2023 6:54 AM GMT
ఏపీ దివాలా అంచుల్లో ఉందని ప్రముఖ ఆర్థిక నిపుణులు జి.వి.రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే 10 లక్షల కోట్ల అప్పు ఉందని ఆందోళన వ్యక్తంచేశారు. ఏ రాష్ట్రమూ ఇలా అప్పు చేయలేదని.. జగన్ సర్కారు రుణాలతో రోజులు నెట్టుకు వస్తోందన్నారు. ఇది అత్యంత ప్రమాదకరమన్న జి.వి.రావు.. ఏపీ అప్పులపై చర్చ జరగాలని తెలిపారు. ఇలాంటి ప్రభుత్వమే మళ్లీ వస్తే మహాప్రమాదమని ఆందోళన వ్యక్తం చేశారు. పొరుగు రాష్ట్రాలు అప్పులు చేసి ప్రాజెక్టులు నిర్మించడం, పరిశ్రమలు స్థాపించి ఉపాధి కల్పించే పనులు చేస్తుంటే.. ఏపీ మాత్రం రోజు వారీ ఖర్చుల కోసమే అప్పులు చేస్తోందన్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com