
By - Chitralekha |10 May 2023 12:37 PM IST
వాంఖడే స్టేడియంలో ముంబై బ్యాట్టర్ సూర్యకుమార్ యాదవ్ విధ్వంసకర బ్యాటింగ్ చేశాడు. హాఫ్ సెంచరీతో చెలరేగిన సూర్య.. 35 బంతుల్లోనే 83 పరుగులు చేశాడు. దాంతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది. 200 పరుగుల భారీ లక్ష్యాన్ని 16.3 ఓవర్లలోనే 4 వికెట్ల నష్టానికి చేధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉన్న ముంబై ఇండియన్స్.. ఈ విజయంతో మూడో స్థానానికి చేరుకుంది. బెంగళూరును చిత్తు చేసిన రోహిత్ సేన.. ఐపీఎల్ పోరులో ప్లేఆఫ్ అవకాశాలను సజీవం చేసుకుంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com