జగన్ కావలి పర్యటన... అధికారుల అత్యుత్సాహం

జగన్ కావలి పర్యటన... అధికారుల అత్యుత్సాహం

ముఖ్యమంత్రి నెల్లూరు జిల్లా కావలి పర్యటన నేపథ్యంలో వైసీపీ శ్రేణులు, అధికారులు హడావుడి చేస్తున్నారు. కావలిలో హెలిప్యాడ్‌కు దూరంగా ఉన్న పచ్చని చెట్లను నరికి.. ఎప్పటికప్పుడు తరలించేస్తున్నారు. 25 ఇళ్లకు విద్యుత్‌ కనెక్షన్లు తొలగించారు. విద్యుత్‌ స్తంభాలు కూడా తొలగిస్తామంటూ అధికారులు బెదిరిస్తున్నారని స్థానికులు వాపోతున్నారు. అధికారులు, ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తీరుపై కావలి అంబేద్కర్ నగర్ దళితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎంతో మంది హెలికాఫ్టర్లలో వచ్చారని, అప్పుడు అడ్డంలేని చెట్లు, విద్యుత్ స్తంభాలు ఇప్పుడెందుకు అడ్డమయ్యాయని ప్రశ్నిస్తున్నారు.

Next Story