By - Chitralekha |10 May 2023 9:42 AM GMT
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. అకాల వర్షాలతో నష్టపోయిన ప్రాంతాల్లో రైతులను పరామర్శించి.. వారికి భరోసా ఇవ్వనున్నారు. పవన్ కల్యాణ్ రెండ్రోజుల పాటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. కొత్తపేట మండలంలోని రైతులతో ముఖాముఖీ నిర్వహించనున్నారు. రైతుల సమస్యలను తెలుసుకోవడంతో పాటు ఎంతమేర పంటనష్టం జరిగిందనే వివరాలు తెలుసుకోనున్నారు. ఆ తరవాత రెండోరోజు పవన్ పోలవరం ప్రాజెక్టును సందర్శించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. పవన్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పర్యటన పలు నియోజకవర్గాల మీదుగా కొనసాగనుంది.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com