By - Chitralekha |10 May 2023 11:33 AM GMT
అబుదాబిలో ప్రవాసీ భారతీయుల ప్రముఖ సాంఘిక సంక్షేమ కేంద్రం మహిళా విభాగం ఆధ్వర్యంలో ఏటా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.. 2022 - 23 ఏడాది గ్రాండ్ ఫినాలే కార్యక్రమాన్ని అంగ రంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భారత రాయబార కార్యాలయాన్ని చెందిన డీసీఎం సతీమణి జాహ్నవి అమర్నాథ్ ముఖ్య అతిధిగా విచ్చేసారు. మొత్తం కార్యక్రమానికి తలమానికంగా నిలిచిన Unity in Diversity Conceptతో చేసిన 29 రాష్ట్రాల ఫ్యాషన్ డ్రెస్ షో అందరినీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రాన్ని రిప్రజెంట్ చేసిన ఇద్దరు మహిళలు తెచ్చిన బోనం, బతుకమ్మలు విశేష ఆకర్షణగా నిలిచాయి.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com