
By - Chitralekha |13 May 2023 12:00 PM IST
జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సమ్మెపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జేపీఎస్లను చర్చలకు పిలిచేది లేదని సీఎస్ శాంతకుమారి తెలిపారు. విధుల్లో ఉన్నవారి జాబితాను మధ్యాహ్నం 12 గంటల లోపు పంపాలని అన్ని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. జేపీఎస్లు సమ్మె విరమించి విధుల్లో చేరాలని.. లేకుంటే సమ్మె విరమించని వారితో ఇక ఎలాంటి సంబంధం ఉండదని హెచ్చరించారు. విధులకు హాజరు కాని వారి స్థానంలో తాత్కాలిక కార్యదర్శులను నియమించాలని సూచించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com