- Home
- /
- చిట్టి న్యూస్
- /
- మరో ట్విస్ట్!

By - Chitralekha |13 May 2023 6:38 AM GMT
రెండేళ్ల క్రితం డ్రగ్స్ ఆన్ క్రూయిజ్ కేసులో షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ను అరెస్ట్ చేసిన యాంటీ నార్కోటిక్ అధికారి సమీర్ వాంఖడేపై సీబీఐ అవినీతి కేసు నమోదు చేసింది. ఆర్యన్ ఖాన్ను విడిపించేందుకు షారూఖ్ తో రహస్య ఒప్పందం కుదిరిందని.. అప్పటి ఎన్సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే 25 కోట్ల రూపాయిలు డిమాండ్ చేశారనే ఆరోపణలపై, కేసును నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ముంబై, ఢిల్లీ, రాంచీ, కాన్పూర్లో దర్యాప్తు సంస్థ సోదాలు నిర్వహించింది. అప్పట్లో వాంఖడే నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ముంబై జోనల్ కు చీఫ్గా ఉన్నారు. 22 రోజులు జైలులో గడిపిన ఆర్యన్ ఖాన్కు తగిన సాక్ష్యాలు లేనందున ఎన్సీబీ క్లీన్ చిట్ ఇచ్చింది.
Next Story
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com