By - Chitralekha |13 May 2023 7:39 AM GMT
కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి కాలినడకన తిరుమల స్వామి వారి దర్శనం చేసుకున్నారు. నేడు కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న వేళ ఆయన కాలినడకన శ్రీవారి దర్శనం చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. కర్ణాటకలో బీజేపీ గెలిస్తే తనకు ముఖ్యమంత్రి పదవి దక్కాలని జోషి సామీ దర్శనం చేసుకున్నారని నెటిజెన్లు అభిప్రాయపడుతున్నారు. బీజేపీ గెలిస్తే జోషికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని సెక్యులర్ జనతాదళ్ పార్టీ యోచిస్తున్నట్లు ఆ పార్టీ అధినేత కుమారస్వామి అన్నారు. కానీ మంత్రి దీనిని ఖండించారు. ముఖ్యమంత్రి కావాలనే కోరిక తనకు లేదని, ప్రధాని మోడీ ఆధ్వర్యంలోనే పని చేయాలని ఉందని అన్నారు. ప్రజలు, దేవుడు ఆశీర్వదించినంత కాలం కేంద్ర మంత్రివర్గంలో ఉండాలని కోరుకుంటున్నట్లు జోషి తెలిపారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com