మంత్రికి పుత్రోత్సాహం

మంత్రికి పుత్రోత్సాహం

తెలంగాణ ఆర్థిక, ఆరోగ్య శాఖ సహాయ మంత్రి తన్నీరు హరీష్ రావు తనయుడు ఆర్చిష్మాన్ రావు అమెరికాలోనికొలరాడో యూనివర్శిటీ నుంచి సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో గ్రాడ్యుయేషన్ పట్టా అందుకున్నారు. యూనివర్సిటీ నుంచి గ్లోబల్ ఎంగేజ్‌మెంట్ అవార్డును అందుకున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి కుటుంబ సమేతంగా హాజరై తన కుమారుడిని అభినందించారు. ఇదే విషయాన్ని ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. అతడు సాధించిన అద్భుత విజయాన్ని చూసి గర్వపడుతున్నా. అతడి పట్టుదల, సాధించాలనే తపనకు ఇది నిదర్శనమని అన్నారు. తన నైపుణ్యంతో ప్రపంచంలో సానుకూల ప్రభావాన్ని సృష్టించగలడని ఆశాభావం వ్యక్తం చేశారు.

Next Story