By - Chitralekha |13 May 2023 10:35 AM GMT
కర్ణాటక ఎన్నికల్లో... జేడీఎస్ పరిస్థితి దారుణంగా తయారైంది. 2018 ఎన్నికల్లో 32 స్థానాలు సాధించిన ఆ పార్టీ ఈ సారి కేవలం 21 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దాదాపు పది సీట్లు కోల్పోయింది. హంగ్ పై ఆశలు పెట్టుకున్న కుమారస్వామి ఆశలు అడియాశలు అయ్యాయి. గత రాత్రి హుటహుటిన సింగపూర్ నుంచి బెంగళురూ చేరుకున్న ఆయన ప్రత్యేకంగా పూజులు చేశారు. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం రెండు పెద్ద పార్టీలే భారీ స్కోర్ చేస్తాయని అన్నారు. చిన్న పార్టీ అని, తనకు అంత డిమాండ్ లేదన్నారు కుమారస్వామి. అంతేకాదు హంగ్ వచ్చే పరిస్థితి లేదన్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com