By - Chitralekha |13 May 2023 10:57 AM GMT
లండన్ పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్ భారత హై కమిషనర్ విక్రం కె. దురై స్వామి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇన్వెస్ట్ మెంట్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. పెట్టుబడులకు తెలంగాణ స్వర్గదామమని మంత్రి అన్నారు. రాష్ట్రంలో పారిశ్రామికీకరణ వేగవంతమయిందని, తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సింగిల్ విండో అనుమతుల విధానం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని కోరారు. తమ ప్రభుత్వం నుంచి అన్ని రకాల సహకారాలు అందిస్తామని మంత్రి కేటీఆర్ చెప్పారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com