
By - Chitralekha |16 May 2023 12:07 PM IST
పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ బలంగా ఉన్న చోట్ల టీఎంసీ మద్దతు ఇస్తుందని ప్రకటించారు. బీజేపీకి వ్యతిరేకంగా కూటమి ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్న నేపథ్యంలో మమత వ్యాఖ్యలు కాంగ్రెస్లో ఉత్సాహం నింపుతున్నాయి. కాంగ్రెస్ కు మద్దతుగా నిలుస్తామని, అందులో తప్పేమీ లేదని... అయితే వారు కూడా ఇతర రాజకీయ పార్టీలకు సపోర్ట్గా నిలవాలన్నారు. సీట్ల కేటాయింపు ఫార్ములా విషయంలోనూ ప్రాంతీయ పార్టీలు ఎక్కడైతే బలంగా ఉన్నాయో అక్కడ వారికి ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com