ఇందిరాపర్క్ లో దొంగలు పడ్డారు

ఇందిరాపర్క్ లో దొంగలు పడ్డారు

హైదరాబాద్‌ ఇందిరాపార్క్‌లో గంధం చెట్ల అపహరణ కలకలం సృష్టిస్తోంది. గతంలో 10 గంధపు చెట్లను నరికి అపహరించారు గుర్తు తెలియని వ్యక్తులు. మళ్లీ అదే బాటలో చెట్లుకు గాట్లు పెట్టి మరీ వెళ్లారు దుండగులు. దాదాపు 8 చెట్లకు గాట్లు పెట్టడంతో పలు అనుమానాలకు తావిస్తుంది. ఈ ఘటనపై పోలీసులు నిఘా పెట్టారు. ఇందిరాపార్క్‌ మేనేజర్‌ భాస్కర్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గాట్లు పెట్టిన చెట్లు చనిపోకుండా ఉండేందుకు ఉద్యాన శాఖ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.

Next Story