
By - Chitralekha |16 May 2023 4:18 PM IST
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఏపీలో ఉష్ణోగ్రతలు ఏకంగా 50 డిగ్రీల మార్క్కు చేరువ అయ్యాయి. రాజమండ్రిలో అత్యధికంగా 49డిగ్రీల నమోదైంది. మరోవైపు ఏలూరులో 48 డిగ్రీలు, గుంటూరు, చిలకలూరిపేటలో 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు తెలంగాణలోనూ ఇదే పరిస్థితి. కొత్తగూడెం, మిర్యాలగూడెలో ఏకంగా 47 డిగ్రీలు నమోదైంది. పాల్వంచ 46, నల్గొండ, ములుగులో 45 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదు కాగా, వరంగల్ 43, నిర్మల్, మంచిర్యాలలో 42 డిగ్రీలు నమోదయినట్లు అధికారులు తెలిపారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com