డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల మోసం.. ఇద్దరు మహిళల అరెస్ట్

డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల మోసం.. ఇద్దరు మహిళల అరెస్ట్

డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు ఇప్పిస్తామంటూ వందల మందిని మోసం చేసిన ఇద్దరు మహిళల్ని.. ఖమ్మం టూటౌన్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. అంగన్‌వాడీ టీచర్‌గా పనిచేసే షకీనాబేగం, రిసోర్స్‌ పర్సన్‌గా విధులు నిర్వహిస్తున్న లక్ష్మిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో బాధితులు టూటౌన్‌ పీఎస్‌ వద్దకు భారీగా తరలివచ్చారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ క్రమంలో పోలీస్‌స్టేషన్‌ వద్ద ఉద్రిక్తత తలెత్తింది. నిందితులను కోర్టుకు తరలిస్తుండగా పోలీసుల వాహనాలను అడ్డుకున్నారు.

Next Story