By - Vijayanand |16 May 2023 12:22 PM GMT
మెదక్ జిల్లాలో అన్నదాతలు రోడ్డెక్కారు. తూకం వేసిన ధాన్యాన్ని లారీల కొరత వల్ల తరలించడం లేదని వెల్దుర్తిలో రైతులు ఆందోళన చేపట్టారు. ప్రధాన రహదారిపై ముళ్లకంచె వేసి ధర్నాకు దిగారు. వరికి తెగులు సోకి తీవ్రంగా నష్టపోయామని.. అకాల వర్షాలకు మరింత నష్టపోయామని వాపోయారు. ధాన్యం కొనుగోలు చేయకుండా అధికారులు ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. వెంటనే ధాన్యాన్ని మిల్లులకు తరలించాలని డిమాండ్ చేశారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com