By - Chitralekha |17 May 2023 9:10 AM GMT
కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్టీపీ విలీనంపై చేస్తున్నట్లు వస్తున్న వార్తలను ఆ పార్టీ అధ్యక్షురాలు షర్మిల కొట్టిపడేశారు. విలీనం చేయటానికి పార్టీ పెట్టాల్సిన అవసరం లేదని.. తాను వస్తానంటే ఏ పార్టీ కూడా వద్దని చెప్పదన్నారు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితే బాగోలేదని.. 19 మంది ఎమ్మెల్యేలే గెలిస్తే.. ప్రస్తుతం ఐదుగురు మాత్రమే ఉన్నారని ఎద్దేవా చేశారు. గెలిచిన ఎమ్మెల్యేలను నిలుపుకోలేని నాయకత్వ లోపం కాంగ్రెస్ లో ఉందన్నారు. ఇక పొత్తులపై అన్ని పార్టీల నుంచి తమకు మిస్డ్ కాల్స్ వస్తున్నాయని.. ప్రస్తుతం చార్జింగ్ మోడ్లో ఉన్నామన్నారు షర్మిల.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com