
By - Chitralekha |17 May 2023 3:30 PM IST
విమానంలో బీడీ తాగుతూ పట్టుబడిన ఓ వ్యక్తి జైలు పాలైన ఘటన అహ్మదాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తోన్న అకాసా విమానంలో చోటుచేసుకుంది. ప్రవీన్ కుమార్ (56) అనే వ్యక్తి టాయ్ లెట్ కు వెళ్లి బీడీ తాగుతున్నట్లు ఎయిర్ లైన్స్ సిబ్బంది గుర్తించారు. దీనిపై డ్యూటీ మేనేజర్ బెంగళూరు విమానాశ్రయ పోలీసులకు ఫిర్యాదు చేయగా, అతడిని అరెస్ట్ చేసి సెంట్రల్ జైలుకు తరలించారు. జీవితంలో మొదటిసారి విమానం ఎక్కినట్లు వెల్లడించిన ప్రవీణ్ నిబంధనల గురించి తెలియదని వాపోతున్నాడు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com