
By - Chitralekha |17 May 2023 5:06 PM IST
అనంతపురం జిల్లాలో ఏపీ ఉద్యోగుల మూడో దశ ఉద్యమం ప్రారంభమైంది. ఏపీజేఏసీ అమరావతి ఆధ్వర్యంలో సాగుతున్న ఉద్యోగుల ఆందోళనకు కార్మిక సంఘాలు మద్దతు తెలిపాయి. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలంటూ నినాదాలతో హోరెత్తించారు. 60 రోజులుగా ఉద్యమం చేస్తున్నా జగన్ సర్కారు పట్టించుకోవడం లేదని ఏపీజేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు మండిపడ్డారు. ఉద్కోగులకు జగన్ సర్కారు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఉద్యమం తీవ్రరూపం దాల్చుతుందని బొప్పరాజు హెచ్చరించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com