నంద్యాలకు చేరుకున్న యువగళం

నంద్యాలకు చేరుకున్న యువగళం

టీడీపీ యువనేత నారా లోకేష్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర 103వ రోజుకు చేరుకుంది. నంద్యాల నియోజకవర్గం నుంచి ప్రారంభమైన పాదయాత్రలో మ. 2గం.లకు యాతం ఫంక్షన్‌ హాల్‌ వద్ద రైతులతో లోకేష్‌ ముఖాముఖిలో పాల్గొననున్నారు. సా. 4 గం.లకు శిలాఫలకాన్ని ఆవిష్కరించనున్నారు. 4.45కి కానాలలో జాతీయ రహదారి విస్తరణ బాధితులతో సమావేశమవుతారు. 5.45కి హెచ్‌ఎస్‌ కొట్టాలలో స్థానికులతో భేటీ అవుతారు. అదేవిధంగా 6.55కి జూలపల్లిలో వడ్డెర సామాజిక వర్గీయులతో సమావేశమవ్వనున్నారు. రాత్రి 7.45కి పసరుపాడు, 9.30కి తెల్లాపూరి ప్రజలతో లోకేష్‌ భేటీ అవుతారు.

Next Story