By - Chitralekha |18 May 2023 7:50 AM GMT
యువగళం పాదయాత్రలో ఉన్న నారా లోకేష్ భుజం నొప్పితో బాధపడున్నారు. దీంతో ఇవాళ స్కానింగ్ చేయించుకున్నారు. నంద్యాలలోని ఓ వ్రైవేటు డయాగ్నస్టిక్ సెంటర్లో లోకేష్ కుడి భుజానికి MRI పరీక్షలు చేశారు వైద్యులు. ఉమ్మడి అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గంలోకి పాదయాత్ర ప్రవేశించిన సందర్భంలో భారీగా తరలివచ్చిన ప్రజలు, కార్యకర్తల తోపులాటలో నారా లోకేష్ కుడి భుజానికి గాయమైంది. భుజం నొప్పి అధికంగా ఉండటంతో వైద్యుల సూచన మేరకు జాగ్రత్తలు తీసుకున్నారు. అయినా నొప్పి తగ్గకపోడవంతో గురువారం MRI స్కానింగ్ చేయించుకున్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com