
By - Chitralekha |18 May 2023 1:51 PM IST
ఎంటర్టైన్మెంట్ దిగ్గజం వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ గ్రూప్ తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. హైదరాబాద్లో ఐడీసీ ఏర్పాటు చేస్తామని వెల్లడించింది. అమెరికా పర్యటనకు వెళ్లిన కేటీఆర్ ఆ సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అలెగ్జాండ్ర కార్టర్తో సమావేశమయ్యారు. ఐడీసీ ఏర్పాటు చేసిన తొలి ఏడాదిలో 12 వందల మంది నిపుణులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని కేటీఆర్ వెల్లడించారు. తదుపరి వ్యాపారాభివృద్ధి మేరకు కార్యకలాపాల విస్తరణ ఉంటుందని వివరించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com