
By - Chitralekha |19 May 2023 12:59 PM IST
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని 44వ డివిజన్ వైసీపీ కార్పొరేటర్ వంగల హేమలత తన పదవికి రాజీనామా చేశారు. డివిజన్లో అభివృద్ధి జరగకపోగా కార్యకర్తలకు న్యాయం చేయలేకపోతున్నామంటూ ఆమె తరఫున భర్త వీరారెడ్డి పార్టీ నేతలకు రాజీనామా లేఖలు అందజేశారు. అయితే తాము పార్టీకి రాజీనామా చేయలేదని, పదవికి మాత్రమే చేశామని ఆయన తెలిపారు. దీంతో రంగంలోకి దిగిన పార్టీ ముఖ్య నేతలు వారిని బుజ్జగిస్తున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com