
By - Vijayanand |19 May 2023 4:29 PM IST
వైసీపీ ఏపీని నాశనం చేసిందని టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. చిల్లర రాజకీయాలు చేస్తున్నారని నిప్పులు చెరిగారు. విజయనగరంలో దాసరి సామాజిక వర్గీయులతో చంద్రబాబు సమావేశమయ్యారు. జగన్ పాలనలో అభివృద్ధి శూన్యమని విమర్శించారు. అంతా దోపిడీయేనని ఆరోపించారు. టీడీపీ హయాంలో ఏనాడూ కరెంటు కోతలు లేవని చెప్పారు. వైసీపీ పాలనలో కరెంటు ఎప్పుడు పోతుందో.. ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి నెలకొందని అన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com