టెన్త్ ఫెయిల్... కిడ్నాప్ డ్రామా...

టెన్త్ ఫెయిల్... కిడ్నాప్ డ్రామా...


పదో తరగతి తప్పిన ఓ బాలిక తల్లిదండ్రులు కోపగిస్తారన్న భయంతో ఏకంగా కిడ్నాప్ డ్రామాకు తెరలేపిన ఘటన పశ్చిమబెంగాల్ లో చోటుచేసుకుంది. కోల్ కతాలోని బాన్స్ ద్రోని ప్రాంతానికి చెందిన బాలిక పరిక్షా ఫలితాలను చూసుకుంటానని చెప్పి చెల్లితో సహా ఇంటి నుంచి బయలుదేరింది. అయితే పరీక్షల్లో ఫెయిల్ అయ్యానని తెలుసుకున్న బాలిక తిరిగి ఇంటికి వెళ్లలేక చెల్లిని తీసుకుని పలు ప్రాంతాలు తిరిగింది. తాను చెల్లి కిడ్నాప్ అయినట్లు తండ్రికి ముబైల్ సందేశం పంపింది. పిల్లలు కావాలంటే కోటి రూపాయిలు కావాలని కిడ్నాపర్ మాదిరి మాట్లాడింది. అయితే ఈలోగానే తల్లిదండ్రులు పిల్లలు కనిపించడంలేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు రంగంలోకి దిగ సీసీటీపీ ఫుటేజ్ ఆధారంగా చిన్నారుల ఆచూకీ కనుగొన్నారు. వారిని సురక్షితంగా తల్లిదండ్రుల వద్దకు చేర్చారు.


Next Story