
By - Chitralekha |22 May 2023 4:36 PM IST
విశాఖ జిల్లాలో వైసీపీ నేత దాట్ల పెదబాబు రూ. 4వేల కోట్ల విలువైన భూమిని ఆక్రమించారంటూ, భీమిలి మండలం నారాయణ రాజు పేటకు చెందిన రైతులు ఆరోపించారు. సుమారు 400 ఎకరాల భూమిని, నకిలీ పట్టాలు సృష్టించి విక్రయిస్తున్నారని, విశాఖ కలెక్టరేట్లో రైతులు ఫిర్యాదు చేశారు. ఎమ్మార్వో, ఆర్డీవోలకు ఫిర్యాదు చేసినా అధికారుల్లో చలనం లేదని ఆవేదన వ్యక్తం చేసారు. వారసత్వంగా సంక్రమించిన భూమి కోసం ఎలాంటి పోరాటానికైనా సిద్ధం అంటున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com