
By - Vijayanand |23 May 2023 5:54 PM IST
మెదక్ జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. తూప్రాన్లో బలమైన ఈదురుగాలులతో భారీ వర్షం కురుస్తోంది. అకాల వర్షంతో కల్లాల్లోని ధాన్యం తడిసి ముద్దయ్యింది. ఈదురుగాలులతో టార్పాలిన్లు ఎగిరిపోయాయి. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గాలి దుమారంతో శివాజీ విగ్రహం విరిగిపడింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇళ్లల్లోకి వర్షపు నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com