By - Chitralekha |24 May 2023 10:01 AM GMT
వైద్యం వికటించి నాలుగేళ్ల చిన్నారి మృతి చెందిన ఘటన నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డి పాలెంలోని సన్ షైన్ ఆసుపత్రిలో చోటుచేసుకుంది. వాంతులతో బాధపడుతోన్న చిన్నారిని ఆసుపత్రిలో చేర్చగా, వైద్యుడు ఆమె అధిక డోస్ ఇచ్చినట్లు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పరిస్థితి విషమించడంతో ఆమెను సదరు వైద్యుడే తన కారులో పెద్దాసుపత్రికి తీసుకువెళ్లేందుకు ఉపక్రమించాడు. అయితే మార్గం మధ్యలోనే చిన్నారి ప్రాణాలు విడవడంతో అక్కడ నుంచి పరారయ్యాడని తెలుస్తోంది.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com