ఒడిశాలో రైలు ప్రమాదం

ఒడిశాలో రైలు ప్రమాదం

కోల్‌కతాకు సమీపంలోని షాలిమార్ నుంచి చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్‌కి బయల్దేరిన కోరమండల్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పి లూప్‌ లైన్‌లో ఆగి ఉన్న గూడ్స్‌ను ఢీకొట్టింది.దీంతో ఇంజిన్‌తో పాటు 12 బోగీలు పక్క ట్రాక్‌పై ఒరిగిపోయాయి. ఇదే సమయంలో ఆ ట్రాక్‌పై యశ్వంత్‌పూర్-హౌరా ఎక్స్‌ప్రెస్ దూసుకొచ్చింది. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ బోగీలను ఢీకొట్టింది. యశ్వంత్‌పూర్‌- హౌరా ఎక్స్‌ప్రెస్‌కు చెందిన నాలుగు జనరల్‌ బోగీలు ధ్వంసం అయ్యాయి. కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌లో కోచ్‌లు ధ్వంసం అయ్యాయి. ఇంజిన్‌తో పాటు పట్టాలు తప్పిన B1 బోగీ. ఘటనా స్థలంలో దృశ్యాలు హృదయ విదారకంగా ఉన్నాయి.

Next Story