కందుకూరు వైసీపీలో వర్గపోరు

కందుకూరు వైసీపీలో వర్గపోరు

కర్నూలు జిల్లా కోసిగి మండలం కందుకూరు వైసీపీలో వర్గపోరు నడుస్తుంది. వైసీపీ పార్టీకి చెందిన ఇరు వర్గాలు కత్తులు కర్రలతో ఘర్షణకు దిగారు. గత నాలుగు సంవత్సరాల నుండి బెట్టన్న గౌడ్, రాజోలి బండ భీమారెడ్డి వర్గీయులకు పచ్చగడ్డి వేస్తే భగ్గమన్నట్లు ఘర్షణలు జరుగుతున్నాయి. రాజకీయంగా ఎదుర్కొన లేకనే మాపై దాడులకు దిగారంటూ ఆరోపిస్తున్నారు భీమారెడ్డి వర్గీయులు. దాడిలో తీవ్రంగా గాయపడిన ఇరు వైసీపీ వర్గీయులను ఆదోని ఆస్పత్రికి తరలించారు.

Next Story