
By - Chitralekha |21 April 2023 1:13 PM IST
శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ ( SSST ) డిపాజిట్ చేసిన నాణేలను ఉంచడానికి బ్యాంకులకు భారంగా మారింది. ఏకంగా రూ. 11 కోట్లు నాణేల రూపంలో కలిగి ఉండటంతో స్థలం కొరత ఏర్పడింది. ఈ కారణంగా షిర్డీలోని నాలుగు ప్రభుత్వరంగ బ్యాంకులు ఇప్పుడు నాణేలను తీసుకోవడం మానేశాయని ట్రస్ట్ సీఈఓ రాహుల్ జాదవ్ తెలిపారు. దీంతో ట్రస్ట్ ఆర్బిఐకి లేఖ రాసింది. అహ్మద్నగర్ జిల్లాలోని ఇతర ప్రాంతాలతో పాటు రాష్ట్రంలోని వివిధ బ్యాంకులలో డిపాజిట్ చేసే అవకాశం కల్పించమని కోరింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com