
By - Vijayanand |15 April 2023 1:43 PM IST
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఐకేపీ, పీఏసీఎస్ కేంద్రాలకు వరిధాన్యం పోటెత్తుతోంది. నల్లగొండ, యాదాద్రి, సూర్యాపేట జిల్లాల పరిధిలో మొత్తం 12 లక్షల ఎకరాల్లో ఏకంగా 20 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యం దిగుబడి అవుతోంది. అయితే గత మూడు వారాలుగా ఐకేపీ కేంద్రాల్లో మాత్రం కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయి. దాంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అకాల వర్షాలు నేపథ్యంలో వరిధాన్యం కొనుగోళ్లను త్వరగా పూర్తి చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com