
By - Chitralekha |20 May 2023 11:29 AM IST
రాష్ట్ర సాంకేతిక విద్యా శాఖ కమిషనర్, రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణా మండలి చైర్మన్ చదలవాడ నాగరాణి పాలిసెట్ -2023 ఫలితాలు విడుదల విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 87 ప్రభుత్వ, 171 ప్రైవేటు పాలిటెక్నిక్ కాలేజీల్లో 29 బ్రాంచ్ లలో మూడేళ్ల డిప్లొమా కోర్సులో ప్రవేశాలకు పరీక్షలు నిర్వహించారు. మొత్తం160332 మంది విద్యార్ధులు దరఖాస్తు చేసుకోగా, 143625 మంది పరీక్షలకు హాజరయ్యారు. ఇందులో 124021 మంది ఉత్తీర్ణత సాధించారు. మొత్తం ఉత్తీర్ణత శాతం - 86.35 శాతం కాగా, బాలికల ఉత్తీర్ణత - 88.90 శాతం, బాలుర ఉత్తీర్ణత - 84.74 శాతంగా నమోదైంది. ttps://polycetap.నీచ్.in ఈ వెబ్ సైట్ లో పరీక్షా ఫలితాలు అందుబాటులో ఉన్నాయి. పాస్వర్డ్ : ఎంప్లోయబిలిటీ.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com