దుబాయ్ లో "టీఎఫ్‌సీసీ నంది అవార్డ్స్ సౌత్ ఇండియా 2023`

దుబాయ్ లో టీఎఫ్‌సీసీ నంది అవార్డ్స్ సౌత్ ఇండియా 2023`

తెలంగాణ ప్ర‌భుత్వం స‌హ‌కారంతో ‘తెలంగాణ ఫిలిం ఛాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌’ ఆధ్వ‌ర్యంలో `టీఎఫ్‌సీసీ నంది అవార్డ్స్ సౌత్ ఇండియా 2023`వేడుక‌లు దుబాయ్‌లో ఘ‌నంగా నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు డా.ప్ర‌తాని రామ‌కృష్ణ గౌడ్‌. ఇందులో భాగంగా శుక్ర‌వారం డా.ప్ర‌తాని రామ‌కృష్ణ గౌడ్ , టీమా ప్రెసిడెంట్‌, మిస్ ఏసియా ర‌ష్మి ఠాకూర్ దుబాయ్ వెళ్లి షేక్ అబుసలీంని క‌లిశారు. జులై నెలాఖ‌రు కానీ అగ‌స్టు మొద‌టి వారంలో కానీ అవార్డ్స్ వేడుక నిర్వహించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. షేక్ అబు స‌లీం ప్ర‌తి ఏడాది దుబాయ్ లో నంది అవార్డ్స్ జ‌రపడానికి స‌హ‌క‌రిస్తామ‌ని మాటిచ్చారు. దుబాయ్ ప్రిన్స్, కేర‌ళ ముఖ్యమంత్రి, తెలంగాణ మంత్రుల‌ను, బాలీవుడ్ నుంచి జాకీష‌రాఫ్‌, జితేంద్ర గారిని నంది అవార్డ్స్ కోసం ఆహ్యానిస్తున్నట్లు రామకృష్ణ గౌడ్ తెలిపారు.

Next Story