Tirumala : శ్రీవారిని దర్శించుకున్న సంయుక్త

Tirumala : శ్రీవారిని దర్శించుకున్న సంయుక్త

ప్రముఖ నటి సంయుక్త తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సంయుక్తకు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి దర్శనం కల్పించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన నటికి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారిని తొలిసారి దర్శించుకోవడం సంతోషంగా ఉందని సంయుక్త తెలిపారు. ఈ నెల 21న విరూపాక్ష చిత్రం విడుదల నేపథ్యంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నట్లు వెల్లడించారు. చిత్రం విజయవంతం కావాలని స్వామివారిని ప్రార్థించినట్లు చెప్పారు.

Next Story