వడగాల్పులకు ఉక్కిరి బిక్కిరి అవుతోన్న ఏపీ

వడగాల్పులకు ఉక్కిరి బిక్కిరి అవుతోన్న ఏపీ

ఏపీలో ఎండలు దంచి కొడుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు రోజురోజుకు రికార్డుస్థాయిలో పెరిగిపోతున్నాయి. విజయవాడ, విశాఖ సహా పలు జిల్లాల్లో 45 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చీరాలలో ఎన్నడూ లేనంత అత్యధికంగా 45.9 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అటు బుచ్చిరెడ్డిపాలెం, బల్లికురువలోను 45.9 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంతో పాటు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే రాష్ట్రంలోని 14 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 116 మండలాల్లో వడగాల్పులు వీచాయి. విజయనగరం, అనకాపల్లి, ఎన్టీఆర్ జిల్లా, కడప, మన్యం, కాకినాడ, అల్లూరి జిల్లా, గుంటూరు, కృష్ణా, పల్నాడు, తూర్పుగోదావరి, నంద్యాల, శ్రీకాకుళం, విశాఖ జిల్లాల్లోని 117 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల సంస్థ హెచ్చరించింది.

Next Story