
By - Chitralekha |20 April 2023 5:07 PM IST
రెండు రోజుల క్రితం మౌంట్ అన్నపూర్ణ శిఖరంపై గల్లంతు అయిన భారత పర్వతారోహకుడు అనురాగ్ మలూ ఆచూకీ లభించింది. సోమవారం మలూ అన్నపూర్ణ శిఖరాన్ని అధిరోహించి బేస్ క్యాంప్ నాలుగు నుంచి మూడుకు తిరిగి వస్తుండగా అతడి అచూకీ గల్లంతైన సంగతి తెలిసిందే. దీంతో అతడు మరణించి ఉంటాడని అందరూ భావించారు. అయితే తాజా సమాచారం ప్రకారం మలూ ప్రాణాలతోనే ఉన్నారని తెలిసింది. అనురాగ్ మలూ ప్రాణాలతోనే లభించినప్పటికీ అతడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని అతడి సోదరుడు తెలిపాడు. ప్రస్తుతం అతడికి చికిత్స అందుతోందని స్పష్టం చేశాడు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com