By - Vijayanand |19 May 2023 1:15 PM GMT
సీబీఐ ముందు హాజరుకావడానికే అవినాష్ రెడ్డి హైదరాబాద్ వెళ్లారని చెప్పారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. అనుకోకుండా ఆయన తల్లి ఆరోగ్యం బాగోలేదని తెలియడంతో పులివెందులకు వెళ్తున్నారని తెలిపారు. వివేకానందరెడ్డిని నరికినోడేమో బయట తిరుగుతున్నారు. హత్య కేసులో ఎలాంటి సంబంధం లేని వారిని వేధిస్తున్నారు. అవినాష్ కారు వెనుక వెళ్లే మీడియా పై దాడిజరగడం దురదుష్టకరం. మీడియాపై అలా దాడి జరగకూడదు ... దాడి విషయం అవినాష్ కు తెలిసి ఉండకపోవచ్చు. అవినాష్ రెడ్డి ఎక్కడికో పారిపోతున్నట్లుగా మీడియా వెంబడించింది. అవినాష్ రెడ్డి ని నేరస్తుడు గా చూపే ప్రయత్నించడం సరికాదని ఆయన అన్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com