తెలంగాణ భవన్‌ ఆవరణలో యువతి ఆత్మహత్యాయత్నం

తెలంగాణ భవన్‌ ఆవరణలో యువతి ఆత్మహత్యాయత్నం

ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో కలకలం రేగింది. శేజల్‌ అనే యువతి ఆత్మహత్యా యత్నం చేసింది. తెలంగాణ భవన్‌ పార్కింగ్‌లో విషం తాగింది. దీంతో గమనించిన స్థానికులు ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చెన్నయ్య.. లైంగికంగా వేధించాడంటూ గతంలో ఆమె ఆరోపణలు చేశారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యేపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌, జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి ఢిల్లీలోని తెలంగాణ భవన్‌, జంతర్‌ మంతర్‌ వద్ద ధర్నా చేపట్టింది.

Next Story