By - Vijayanand |3 Jun 2023 10:03 AM GMT
యువగళం పాదయాత్ర చేస్తున్న నారా లోకేష్కు రాజకీయ ప్రత్యర్ధులు, అసాంఘిక శక్తులతో ప్రాణహాని ఉందన్నారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య. కట్టుదిట్టమైన రక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ డీజీపీకి లేఖ రాసామన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు, రాజ్యాంగ విలువలు రోజురోజుకు దిగజారుతున్నాయన్నారు వర్ల రామయ్య. రాజకీయ ప్రత్యర్ధులు, అసాంఘిక శక్తులతో లోకేష్ కు ప్రాణహాని ఉందని, అనేకమార్లు డీజీపీ దృష్టికి తీసుకొచ్చామని గుర్తు చేసారు. సంబంధిత అధికారుల ఎటువంటి రక్షణ చర్యలు తీసుకోలేదని అసహనం వ్యక్తం చేసారు వర్ల రామయ్య.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com