
By - Chitralekha |15 May 2023 1:08 PM IST
టీడీపీ యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర నేటితో వంద రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా కుమారుడు లోకేష్తో కలిసి తల్లి భువనేశ్వరి పాదయాత్రలో పాల్గొన్నారు. జనవరి 27న చిత్తూరు జిల్లా కుప్పంలో ప్రారంభించిన మహాపాదయాత్ర ఇప్పటివరకు 34 నియోజకవర్గాల మీదుగా సాగింది. ఈ రోజుతో 1,268 కిలోమీటర్లు పూర్తి చేసుకుంటోంది. లోకేశ్కు ఎక్కడికక్కడ స్థానిక ప్రజలు, టీడీపీ శ్రేణుల నుంచి ఘన స్వాగతం లభిస్తోంది. ఆయా జిల్లాలతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు, టీడీపీ నా యకులు తరలివచ్చి సంఘీభావం చెబుతున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com