
ఓ వాషింగ్ మెషీన్లో తరలిస్తున్న 1.30 కోట్ల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్న ఘటన విశాఖలో కలకలం రేపింది. NADజంక్షన్లో గతరాత్రి పొద్దుపోయిన తర్వాత విజయవాడకు వెళ్తున్న ఓ మినీ వ్యాన్లోని వాషింగ్ మిషన్లో కరెన్సీ నోట్ల కట్టలు, 30 సెల్ఫోన్లను గుర్తించిన పోలీసులు వాహనాన్ని సీజ్ చేశారు. ఆ వాహనం డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. సరైన ఆధారాలు లేనందున CRPC41,102 సెక్షన్ల కింద... కేసు నమోదు చేశారు. అయితే ఆ నగదు, సెల్ఫోన్లు తమవేనని సోనోవిజన్ వ్యాపార సంస్థ తెలిపింది. ఇందులో పన్ను ఎగవేత, నల్లదనం, హవాలావంటి అంశాలు లేవని... ఆ సంస్థ ఎండీ భాస్కరమూర్తి స్పష్టంచేశారు. పండగ సెలవుల్లో బ్యాంకులు పరిమితులు విధించినందున నగదును తప్పనిసరి పరిస్థితుల్లో స్టాక్తోపాటు విజయవాడ బ్రాంచికి తరలించాల్సి వచ్చిందని భాస్కరమూర్తి వివరించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com