140 కోట్ల ప్రజల ఆకాంక్షలు, కలల ప్రతిబింబం

140 కోట్ల ప్రజల ఆకాంక్షలు, కలల ప్రతిబింబం

నూతన పార్లమెంట్ కేవలం భవనం కాదని.. 140 కోట్ల ప్రజల ఆకాంక్షలు, కలల ప్రతిబింబమని అన్నారు ప్రధాని మోదీ. ఇది పాత, కొత్త కలయికల అస్తిత్వానికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ప్రపంచానికి భారత్ దృఢ సంకల్పం సందేశం ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రపంచం మొత్తం భారత్ సంకల్పం, అభివృద్ధిని గమనిస్తోందన్నారు. కొత్త ఆలోచనలు, సంకల్పంతో భారత్ ప్రగతి పథాన పయనిస్తోందని.. దేశ అభివృద్ధి.. ప్రపంచ వృద్ధికి ప్రేరణ అవుతుందని చెప్పారు. సేవా, కర్తవ్యానికి సెంగోల్ ప్రతీక అన్న ప్రధాని మోదీ.. రాజదండంకు పూర్వ ప్రతిష్ట, గౌరవం తీసుకురావాలన్నారు.

Next Story