
తెలంగాణలో 20 మంది సీనియర్ ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ప్రస్తుతండీజీపీగా ఉన్న రవిగుప్తాకు పూర్తి బాధ్యతలు అప్పగించిన ప్రభుత్వం...అంజనీ కుమార్ నురోడ్డు భద్రతా విభాగం ఛైర్మన్ గా నియమించింది. ప్రింటింగ్ అండ్ స్టేషనరరీ కమిషనర్ గా అంజనీకుమార్ కు... అదనపు బాధ్యతలు అప్పగించింది. మహేశ్ భగవత్ ను రోడ్డు భద్రతా విభాగం అదనపు డీజీగా నియమించింది. విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ డీజీగా రాజీవ్ రతన్ ను నియమించిన ప్రభుత్వం ఏసీబీ డీజీ బాధ్యతలను సీవీ ఆనంద్ కుఅప్పగించింది. ఏసీబీ డైరెక్టర్ గా ఏఆర్ శ్రీనివాస్ ను నియమించింది. పోలీసు అకాడమీ డైరెక్టర్ గా అభిలాష బిస్త్, జైళ్ల శాఖ డీజీగా సౌమ్య మిశ్రా నియమితులయ్యారు. సీఐడీ అదనపు డీజీగా శిఖా గోయల్ ను నియమించిన ప్రభుత్వం.. సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ గా అదనపు బాధ్యతలు కట్టబెట్టింది. హోంగార్డ్స్ ఐజీగా స్టీఫెన్ రవీంద్రను నియమించిన ప్రభుత్వం అదనంగా వెల్ఫేర్ అండ్ స్పోర్ట్స్ విభాగం బాధ్యతలు అప్పగించింది. అబ్కారీ శాఖ డైరెక్టర్ గా కమలాసన్ రెడ్డికి బాధ్యతలు అప్పగించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com