By - Chitralekha |29 July 2023 7:12 AM GMT
కృష్ణా జిల్లా పామర్రులో పంటపొలాలు నీట మునిగాయి. దాదాపు 3వేల ఎకరాల్లో పంట నీట మునిగింది. ఇరిగేషన్ డ్రైనేజీ వ్యవస్త లేకపోవడంతోనే పంటపొలాల్లోకి భారీగా వరద నీరు చేరుతుందని రైతులు ఆరోపిస్తున్నారు. ఎకరానికి 10వేల నుంచి 15 వేల రైపాయల వరకు నష్టం ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 30 ఏళ్లలో పంటపొలాలు మునగడం ఇదే ప్రథమం అని వాపోతున్నారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని,సబ్సిడితో విత్తనాలు అందించి,వెంటనే నష్టపరిహారం ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే కలెక్టరేట్ ను ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com