By - Vijayanand |15 July 2023 10:08 AM GMT
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు మాగంటి గోపీనాథ్ ఆధ్వర్యంలో పలువురు బీఆర్ఎస్లో చేరారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం మసీదు గడ్డలో 400 మందికి పైగా ముస్లిం మైనార్టీ కార్యకర్తలు గులాబీ కండువా కప్పుకున్నారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికీ అందాయని.. ప్రతి కార్యకర్త ప్రతి ఇంటికి వెళ్లి సంక్షేమ పథకాలపై వివరించాలని మాగంటి గోపీనాథ్ అన్నారు. బీఆర్ఎస్కు జూబ్లీహిల్స్ నియోజకవర్గం కంచుకోటగా మారడానికి కార్యకర్తలు కష్టపడ్డారని పేర్కొన్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com