
By - Chitralekha |31 Aug 2023 4:58 PM IST
వచ్చే నెలలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశం కానుంది. సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు.. ఐదు రోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రత్యేక సమావేశాలపై ప్రకటన చేశారు. అకస్మాత్తుగా పార్లమెంట్ సమావేశాలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. కేంద్రం ఏమైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోనుందా? లేదంటే కీలకమైన బిల్లులు ప్రవేశపెట్టనుందా? అన్న ఉత్కంఠ నెలకొంది. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలపై ప్రతిపక్ష నేతల్లోనూ విభిన్నరకాల చర్చలు జరుగుతున్నాయి.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com