By - Chitralekha |14 Aug 2023 10:20 AM GMT
తిరుమల కాలినడక మెట్ల మార్గంలోని పరిసరాల్లో మరో ఐదు చిరుతలు సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. ఏడో మైలు, నామాలగవి, లక్ష్మీనరసింహస్వామి ఆలయం పరిసరాల్లో చిరుతలు తిరుగుతున్నాయని వెల్లడించారు. ట్రాప్ కెమెరాల్లో చిరుతల దృశ్యాలు నమోదయ్యాయని తెలిపారు. ఇవాళ ఉదయం తిరుమల-అలిపిరి కాలినడక మార్గంలోని ఏడో మైలు వద్ద ఏర్పాటు చేసిన బోనులో ఓ చిరుత చిక్కింది. ఈక్రమంలో చిరుత స్వల్పంగా గాయపడటంతో.. ఎస్వీ జూ పార్కులో చికిత్స అందిస్తున్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com